AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఈ మేరకు అల్లూరి జిల్లా నందిగరువు ప్రజలతో పవన్ మాట్లాడనున్నారు. గిరిపుత్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అడవితల్లి బాటలో భాగంగా నిర్మించిన రోడ్లను పవన్ ప్రారంభించనున్నారు.