MNCL: మంచిర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం అందిస్తున్న అధునాతన 5జి మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంగళవారం పంపిణీ చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, సిడిపిఓలు చందన, రేష్మా, తదితరులు పాల్గొన్నారు.