NLR: ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదరవల్లి సూచించారు. సోమవారం ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో వైద్య సిబ్బంది పర్యటించారు. సన్ స్ట్రోక్ ఎక్కువ ఉన్నందున ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.