MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామ నూతన సర్పంచ్ విజయలక్ష్మి గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఆదివారం బాదంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నూతన సర్పంచ్తో పాటు వార్డు సభ్యులను గ్రామానికి చెందిన దుర్గామాత సేవా సమితి నిర్వాహకులు శాలువా కప్పి సన్మానించారు. గ్రామ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు అవుదామని తెలిపారు.
ASF: ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ పై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పెట్టుబడితే కేసు నమోదు చేస్తామని ఆసిఫాబాద్ జిల్లా SP నితికా పంత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని SP సూచించారు.
RR: షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో అమ్మవారి ఆలయంపై కాంగ్రెస్ జెండాలు, తోరణాలు ఏర్పాటు చేయడాన్ని బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండించింది. పవిత్రమైన అమ్మవారి ఆలయంపై పార్టీ జెండాలు, తోరణాలు కట్టడం తీవ్ర అభ్యంతరకరమని కార్యకర్తలు అన్నారు. ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని ఆలయంపై ఏర్పాటు చేసిన జెండాలు, తోరణాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
KMM: వరదలు, పరిశ్రమల ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. నయాబజార్ ZPSS, జనరల్ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ జరగనున్నందున ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇందులో 50 మంది చొప్పున ఆపద మిత్ర వలంటీర్లు, 20 మంది NCC కేడెట్లు పాల్గొంటారని తెలిపారు.
TG: ధ్యానం ద్వారా ప్రశాంతంగా ఉంటుందని శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేశ్ డి పటేల్(దాజీ) అన్నారు. ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళనను జయించవచ్చునని, మనసు కేంద్రంగా ధ్యానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు. మనసు ప్రశాంతంగా ఉంటే ఏకాగ్రత వస్తోందని, ఏకాగ్రత ద్వారా సునాయాసంగా విజయాలు సాధించవచ్చన్నారు. ధ్యానం చేశాక వచ్చే మార్పును మీరు గమనించవచ్చని సూచించారు.
MDK: హైద్రాబాద్ నాగోల్లో జరుగుతున్న విద్యాసదస్సుకు ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. TRTF చేగుంట మండల కమిటీ ఆధ్వర్యంలో 80 వసంతాల అభ్యుదయోత్సవం పై విద్యా సదస్సు నిర్వహిస్తున్నారు. విద్యాసభకు ఉపాధ్యాయులు జగన్ లాల్, అబ్దుల్ రషీద్, దేవరాజ్, విట్టల్, రత్నాకర్ తదితరులు తరలివెళ్లారు.
ఆసిఫాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు GRP హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య ఆదివారం ప్రకటనలో తెలిపారు. మృతుడి వయసు 25-30 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. రేచిని వైపుకు డౌన్ లైన్ ట్రాక్ ఫై పడుకోని ఆత్మహత్య చేసుకొని చనిపోయడన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9849198382లో సంప్రదించాలన్నారు. ఈ ఘటపనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VZM: మాజీ సీఎం YS జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆదివారం 40వ డివిజన్లలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సూచనలు మేరకు హోమం నిర్వహించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన నాయకులు ఈశ్వర కౌశిక్ , జోనల్ నాయకులు, డివిజన్ కార్పొరేటర్ పాల్గొన్నారు.
విశాఖ: GVMC 55వ వార్డులో గల సచివాలయాలలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ సీనియర్ నాయకులు ఈతలపాక సుజాత ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ కార్యక్రమంలో ANM స్వాతి, భార్గవి, అంగన్వాడీ టీచర్ కమల, ఆదిలక్ష్మి, టీడీపీ వార్డు నాయకులు గంట్యాడ వీరుబాబు పాల్గొన్నారు.
RR: చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని రంగారెడ్డి కాలనీ కమాన్ మహమూద్ హోటల్ వద్ద ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు ఉన్నాయని స్థానికులు ఆరోపించారు. విద్యుత్ వైర్లు చేతికి అందేలా ఉన్నాయని దీంతో ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ వైర్లను సరిచేయాలని స్థానికులు కోరారు.
దక్షిణాఫ్రికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. జొహన్నెస్బర్గ్ శివారులోని టౌన్షిప్లో ఓ గుర్తుతెలియని సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. దక్షిణాఫ్రికాలో ఈ నెలలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన కావటం గమనార్హం. డిసెంబరు 6న ప్రిటోరియా సమీపంలో జరిగిన కాల్పుల్లో మూడేళ్ల చిన్నారిసహా 10 మందికిపైగా మరణించారు.
ASR: పిల్లల బంగారు భవిష్యత్కు పోలియో చుక్కలు తప్పనిసరి అని ఎస్టీ కమీషన్ మెంబర్ కిల్లో సాయిరాం అన్నారు. ఆదివారం అరకులోయ మండలం పద్మాపురం పంచాయితీ యఃడపల్లివలసలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు సామాజిక బాధ్యతగా బావించి ఐదేళ్ళ లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు.
GDWL: శ్రీజోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన బహిరంగ టెండర్లలో ఈ ఏడాది ఆదాయం తగ్గింది. గతేడాది పార్కింగ్ రూ. 70లక్షలు,టెంకాయల విక్రయాల ద్వారా రూ.కోటి 27 లక్షలు, చీరల వేలంలో రూ.91 లక్షల భారీ ఆదాయం లభించింది. ఈ ఏడాది 6సార్లు వాయిదా పడిన అనంతరం నిర్వహించిన టెండర్లలో పార్కింగ్ రూ.60 లక్షలు, టెంకాయలు రూ.67లక్షలు, చీరలు రూ.80 లక్షల వచ్చాయి.
SKLM: పోలాకి మండలం మబుగాం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిండు ప్రాణానికి తప్పనిసరిగా రెండు చుక్కలు వేయాలని సూచించారు. భారతదేశాన్ని పోలియో రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు.
కోనసీమ: అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించడం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరి బాధ్యత అని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఉప్పలగుప్తం మండలంలోని ఎస్ యానంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.