TPT: వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో ఉన్న 132 KV సబ్ స్టేషన్లో మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని డీఈఈ శీనయ్య చెప్పారు. మున్సిపాలిటీ, వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల పరిధిలో కరెంట్ ఉండదని అన్నారు. ఈ విద్యుత్ అంతరాయానికి ప్రజలందరూ సహకరించాలని తెలిపారు.
CTR: అన్నదాత సుఖీభవ-PM కిసాన్ 3వ విడతలో భాగంగా నగరి నియోజకవర్గంలోని 20,063 మంది రైతులకు రూ.11.27 కోట్లు చెక్కును నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం రైతులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ.20,000 ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.
SKLM: ఆడపిల్లల ఆరోగ్యమే సమాజానికి పునాది అని నరసన్నపేట టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అర్చన అన్నారు. శుక్రవారం పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ వ్యాక్సి నేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే అరికట్టేందుకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని అన్నారు.
ATP: అనంతపురంలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ కమిటీ చైర్మన్ అమిలినేని నరేంద్ర చౌదరి, ఈవో నాగేంద్రుడుతో కలిసి చర్చించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు.
AP: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం రాష్ట్రాంలోని విమాన టికెట్లపై పడింది. డొమెస్టిక్ విమానాలకు 10 శాతం టికెట్ ధరలు పెరిగాయి. ఇంటర్నేషనల్ విమాన టికెట్ ధరలు 4 రెట్లు పెరిగాయి. కాగా.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానయాన సంస్థలు ప్రయాణికులపై ఆ భారాన్ని మోపేందుకు సిద్ధమవుతున్నాయి.
KMM: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 14వ రోజు 21వ డివిజన్లో మధిర మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ పారిశుద్ధ్య పనులు శుక్రవారం పర్యవేక్షించారు. పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అందులో తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా ఉంచి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి అని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
కియా సోనెట్ తన లైనప్లో చౌకైన ఆటోమేటిక్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. డీజిల్-ఆటోమేటిక్ ధర రూ.9.77L నుంచి, టర్బో-పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.9.89L నుంచి ప్రారంభమవుతుంది. దీంతో డీజిల్-ఆటోమేటిక్ విభాగంలో దేశంలోనే అత్యంత చౌకైన కాంపాక్ట్ SUVగా సోనెట్ నిలిచింది. పాత ధరలతో పోలిస్తే దాదాపు రూ.2.25L వరకు భారం తగ్గింది. కొత్తగా ‘మాగ్మా రెడ్’ కలర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
AP: అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ ఉగాది కానుకగా మూడో విడత నిధులను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు రూ.6 వేల చొప్పున వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
వనపర్తి: జిల్లాలో గృహ వసరాలకు ఎల్.పీ.జీ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం వనపర్తి ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆయన మాట్లాడారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవద్దని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో సైతం సిలిండర్ల సమస్య రాకుండా చూడాలన్నారు.
TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ తీర్పు ఆర్డర్ కాపీలు సుప్రీంకోర్టుకు ఇవ్వడం లేదని.. మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. విచారణకు రెండేళ్ల సమయం తీసుకున్నారని విమర్శించారు. రాజ్యాంగం పట్టుకుని తిరగడానికి రాహుల్ అనర్హుడని.. 10వ షెడ్యూల్ని రేవంత్ అపహాస్యం చేశారని మండిపడ్డారు. దానం, కడియంపై తీర్పు చూశాక.. దేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
కోనసీమ: అంబాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య నిమిత్తం వచ్చే రోగుల పట్ల వైద్యులు, వైద్య సిబ్బంది మర్యాదపూర్వకమైన వైఖరితో మెలగాలని ఎంపీపీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ దొమ్మేటి వెంకటేశ్వరరావు సూచించారు. ఆయన పీహెచ్సీ వద్ద అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి ఆసుపత్రి అభివృద్ధి పనుల నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కమిటీ సభ్యులతో చర్చించారు.
KMM: మధిర రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో మామిడి మొక్కలు నాటే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. చెట్లు నాటడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.
BDK: కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని ఔషధాల నిల్వ గదిని సందర్శించి అక్కడ నిల్వ ఉంచిన మందుల స్టాక్ను పరిశీలించారు.
KRNL: బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, ఇవాళ జిల్లా అధ్యక్షుడు అక్కంతోట రామకృష్ణ సూచనలతో ఆలూరు అసెంబ్లీలో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ క్రమ శిక్షణ మహాభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆలూరు ఇంఛార్జ్ కమలమ్మ, మండల అధ్యక్షుడు బసవరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏడు శిక్షణ అంశాలను నిర్వహించి కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు.
TG: ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలన్నారు. పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని తెలిపారు.