కృష్ణా: మచిలీపట్నం 23వ డివిజన్ ఇంఛార్జ్, టీడీపీ నాయకులు చింతా చిన్ని మాతృమూర్తి చింతా భాగ్యలక్ష్మి మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆమె పార్దివదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ATP: విడపనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. మండల ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో మంత్రి మొక్కులు నాటి, నీళ్లు పోశారు. వాటిని సంరక్షించాలని సిబ్బందికి సూచించారు.
NTR: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిపరిశీలించారు. అయన మాట్లాడుతూ.. 4రోజుల పాటు అకాల వర్షాలు ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ధాన్యాన్ని మరింత వేగంగా, యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలన్నారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీటీ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి మాట్లాడుతూ.. ఆర్డిటి కాలనీలో త్రాగునీరు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.
SKLM: AIYF 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ అన్నారు. మంగళవారం ఆముదాలవలస స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద AIYF 17వ జాతీయ మహాసభలు గోడ పత్రికను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. అత్యధిక జనాభా కలిగిన దేశం మనదని అయితే దేశంలో 65శాతం యువత ఉందని యువశక్తిని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు.
ASF: ఆసిఫాబాద్ మండలంలోని MPDO కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రంని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అదనపు కలెక్టర్, మండల ప్రత్యేక అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను పరిశీలించారు. పథకం దరఖాస్తుకు ఈనెల 14 చివరి తేదీ అన్నారు. యువత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో కేకేఎం ట్రస్ట్ ఛైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ మంగళవారం జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్ నగర్లో స్ఠానిక నాయకులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పున్నరెడ్డి, బుచ్చిరెడ్డి, పాల్గొన్నారు.
HYD: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్ష విధించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 12 ఏళ్ల తర్వాత తీర్పు రావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ NIA అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ATP: జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి తల్లిపాల నిధి కేంద్రం, ధన్వంతరి మీటింగ్ హాల్, ఆర్వోప్లాంట్ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. తల్లిపాల నిధి కేంద్రానికి విరాళమిచ్చిన తాడిపత్రి అర్జాస్ స్టీల్స్, వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు విరాళమిచ్చిన సప్తగిరి క్యాంఫర్ లిమిటెడ్ యాజమాన్యానికి మంత్రి అభినందనలు తెలిపారు.
VZM: ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆధ్వర్యంలో గజపతినగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. నిరుపేదలకు గ్రామీణ ప్రాంతంలో ఇంటి స్థలంకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందించారు.
AP: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీమంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా సిలిండర్ ధర రూ.50, పెట్రోల్, డీజిల్పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీని బీజేపీ ప్రభుత్వం పెంచిందని ఫైర్ అయ్యారు. ఇది బీజేపీ వాగ్దానం చేసిన అచ్చేదిన్కు సంకేతమా? లేక మేక్ ఇన్ ఇండియా గ్రేట్ అగైన్కు ప్రారంభమా? అని ప్రశ్నించారు.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలు సగటు వేగం గంటకు 66-96 KM కాగా.. గరీబ్ రథ్ రైలు గంటకు 70-75 KM ప్రయాణిస్తోంది. ఇందులో ఫుల్ ఏసీ సౌకర్యం ఉంటుంది. ఈ రైలులో ప్రయాణానికి KMకు కేవలం 68 పైసలు వసూలు చేస్తారు. 2006 అక్టోబర్లో తొలిసారిగా బీహార్ సహర్సా నుంచి అమృత్సర్కు నడిచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో నడుస్తోంది.
కృష్ణా: అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని సాయిబాబా గుడి పక్కన మలుపులో ఉన్న చెత్త నుంచి మంగళవారం భారీగా మంటలు చెలరేగాయి. చెట్లకు మంటలు అంటుకోవటంతో స్థానికులు సర్పంచ్ దాసరి విజయ్ కుమార్కు సమాచారం అందించారు. అవనిగడ్డ ఫైర్ సిబ్బందికి విషయం తెలపటంతో వారు వచ్చి మంటలు ఆదుపు చేశారు.
WGL: జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గోవిందరావుపేట మండలం రాంనగర్లో రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భానోత్ సమ్మక్కకు చెందిన రేకుల ఇల్లు ధ్వంసమైంది. రేకులు సమ్మక్కపై పడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగాయి, భారీ వృక్షాలు నేలకూలాయి.