ATP: అనంతపురంలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ కమిటీ చైర్మన్ అమిలినేని నరేంద్ర చౌదరి, ఈవో నాగేంద్రుడుతో కలిసి చర్చించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు.