KMM: మధిర రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో మామిడి మొక్కలు నాటే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. చెట్లు నాటడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.