వనపర్తి: జిల్లాలో గృహ వసరాలకు ఎల్.పీ.జీ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం వనపర్తి ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆయన మాట్లాడారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవద్దని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో సైతం సిలిండర్ల సమస్య రాకుండా చూడాలన్నారు.