TPT: వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో ఉన్న 132 KV సబ్ స్టేషన్లో మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని డీఈఈ శీనయ్య చెప్పారు. మున్సిపాలిటీ, వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల పరిధిలో కరెంట్ ఉండదని అన్నారు. ఈ విద్యుత్ అంతరాయానికి ప్రజలందరూ సహకరించాలని తెలిపారు.