WGL: రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు WGL జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భయం లేకుండా, ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. ప్రతి విద్యార్థి మంచి ఫలితాలతో భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. 10వ తరగతి పట్టా విద్యార్థుల జీవితంలో తొలి పట్టా అని అన్నారు.