MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కలిసి శుక్రవారం ప్రారంభించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ కోనేటి పుష్పలత మున్సిపల్ కుర్చీలో కుర్చున్నారు. నూతన భవనంతో ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని, పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.