ASR: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నగదు రైతులు సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి ఏవో మధుసూధనరావు కోరారు. శుక్రవారం వామగెడ్డ ఆర్ఎస్కేలో రైతులతో సమావేశమయ్యారు. పీఎం కిసాన్ 22వ, అన్నదాత సుఖీభవ 3వ ఇన్స్టాల్మెంట్ ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేయడం జరిగిందన్నారు. మండలంలో 10,421 మంది రైతులకు రూ.6,25,26,000 నగదు జమ అయిందన్నారు.