KRNL: మహానంది మండలం తిమ్మాపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 18న మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మహబూబ్ దౌలా తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలోని ఆయా శాఖ అధికారులు నివేదికలతో హాజరు కావాలని కోరారు.