పల్నాడు: ఈపూరు మండలంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా తమ నివాస స్థలాలు, కార్యాలయాలను ప్రతి ఒక్కరూ శుభ్రం చేసుకోవాలని ఏంపీడీఓ తెలిపారు. ముందుగా విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా: నందిగామ పట్టణ పరిధిలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల వెంకట్రావు శనివారం పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ ఉపాధ్యాయులను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ విజ్ఞప్తితో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తాను ఈ ప్రాంతం వాడినని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
గోవా మాజీ MLA, కాంగ్రెస్ నేత లావో మమ్లేదార్ (68) మృతిచెందారు. కర్ణాటకలోని ఓ హోటల్ నుంచి లావో బయటకు వస్తుండగా కారు ఢీకొట్టిందని ఆటోడ్రైవర్ గొడవపడ్డాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ ఒకరికొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. అనంతరం లావో లాడ్జిలోకి వెళ్లగానే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఆటోడ్రైవర్ను అరెస్టు చేశారు.
HYD: గచ్చిబౌలిలోని ఓ రెస్టారెంట్లో ఆహారంలో బొద్దింక దర్శనమిచ్చింది. బాధితుడు రాజేశ్ వివరాలు.. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినే సమయంలో ప్లేట్లో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయాడు. దీనిపై GHMC అధికారులు చర్యలు తీసుకోవాలి అని రాజేశ్ కోరాడు.
AP: నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ను ప్రకటించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. చాలామంది డాక్టర్లు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం అందిస్తారని తెలిపారు. NTR ట్రస్ట్కు తాను ఎప్పటికీ అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు.
HYD: ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు కొన్ని పనిచేయడం లేదని అక్కడికి వెళ్లిన ప్రజలు తెలిపారు. వెంటనే రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని, లేదంటే ఎవరైనా తెలియకుండా ఉపయోగిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాపోయారు.
SDPT: హుస్నాబాద్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
SRD: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కలెక్టర్ కార్యాలయంలో శనివారం పోస్టింగ్ ఉత్తర్వులను అదనపు కలెక్టర్ మాధురి చేతుల మీదుగా ఇచ్చారు. మొత్తం 62 మందికి ఉపాధ్యాయ ఉద్యోగుల పోస్టింగ్ ఇచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు, DCEB కార్యదర్శి లింభాజీ, సెక్టోరియల్ అధికారులు వెంకటేశం, అనురాధ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోర్ బంజారా సమాజం ఆధ్యాత్మిక గురువుగా భావించే బంజారా సమాజానికి చెందిన సామాజిక సంస్కర్త, ఆధ్యాత్మిక నాయకుడైన సంత సేవాలాల్ మహారాజ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
KMR: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకొనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించిందని తెలిపారు.
VZM: ఇకపై నిబంధనలు పాటించని వారి లైసెన్స్లను రద్దు చేస్తామని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమం జరిగింది. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమని, ప్రతి వాహన దారుడు తాను సురక్షితంగా ఉంటూ పక్క వారిని కూడా సురక్షితంగా ఉంచాలన్నారు.
ప్రకాశం: చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అందరూ చెబుతున్నారే తప్ప ఎవ్వరూ ఆచరించడం లేదని CM చంద్రబాబు వద్ద ఓ విద్యార్థిని అసహనం వ్యక్తం చేసింది. స్టేజ్పై ఆమె మాట్లాడుతూ.. కందుకూరుకు నేడు(శనివారం) CM వస్తున్నారని అధికారులు చెత్తను తొలగించారేగాని ప్రతి రోజూ ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని ఆమె వాపోయింది.
PPM: రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి టీ.దుర్గా ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు హెల్మెట్ పెట్టుకున్న వాహనదారులకు కీ చైన్లు అందించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ రావు మాట్లాడుతూ తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించుకోవాలని అవగాహన కల్పించారు.
HNK: భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామం కమ్యూనిటీ హాల్లో నేడు మహిళ శిశు సంక్షేమ శాఖ, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సఖి యొక్క ముఖ్య ఉద్దేశాలు, అందించిన సేవలను తెలియజేయుటకు లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి, సఖి సెంటర్ కేస్ వర్కర్ అనూష, శోభారాణి పాల్గొని సఖి సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు వివరించారు.
PPM: జిల్లాలో పదవ తరగతి చదివే విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. కొందరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నట్లు గురువారం నిర్వహించిన పల్లె నిద్రలో గమనించడం జరిగిందని అన్నారు.