KRNL: ఉపాధి నిధులతో తాజాగా 225 పశువుల షెడ్ల నిర్మాణాలకు కలెక్టర్ రంజిత్ భాషా అనుమతులు ఇచ్చినట్లు జిల్లా నీటి యాజమాన్య PD వెంకటరమణయ్య బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు 6 విడతల్లో 1,245 షెడ్లు, మంజూరుకాగా, 91శాతం షెడ్ల పనులు మొదలయ్యాయన్నారు. వేసవిలో పశువుల కోసం 358పశువులతొట్లు మంజూరు కాగా, ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ.34 వేలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రపంచ ఆర్థిక దృక్పథం వేగంగా మారుతోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన అనంతరం మాట్లాడారు. ‘ప్రస్తుత వాణిజ్య చర్యలు అనిశ్చితులను తీవ్రతరం చేశాయి. ప్రపంచవ్యాప్త పరిస్థితులు రూపాయిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్థిరత్వం సాధించేందుకు ద్రవ్య పరపతి విధానం కీలకపాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు.
AP: అగ్నిప్రమాదంలో గాయపడిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని తన కుమారుడిని పరామర్శించారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా ఇబ్బందులు తలెత్తాయని.. మరో 3 రోజులు తమ పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని పవన్కు వైద్యులు తెలిపారు.
BDK: చండ్రుగొండ మండలం బాలికుంట గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు పలు రకాల పంటలు నేలమట్టమయ్యాయి. వేలాది రూపాయలు పెట్టుబడులతో సాగు చేసిన పంటలు దెబ్బతినటంతో సదరు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, మిర్చి పంటలను సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
KRNL: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 14న ఎమ్మిగనూరులోని తహాసీల్దార్ కార్యాలయ ఆవరణలో తలసేమియా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయాలని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కదిరికోట ఆదెన్న, జి. ఆనంద్ చైతన్య మాదిగలు బుధవారం తెలిపారు. రక్తదానం చేసి మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు.
AP: YCP నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. జగన్ వస్తున్నారు.. ఎక్కువ మంది రావాలంటూ.. వారి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకున్నారని తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే YCP నాయకులు హెలిప్యాడ్పై దాడి చేశారని విమర్శించారు. ఈ క్రమంలో పోలీసులకూ గాయాలయ్యాయన్నారు. ఓ క్రిమినల్ పాలిటిక్స్లో ఎలా ఉంటారో.. జగనే ఉదాహరణ అని మండిపడ్డారు.
KMM: స్వాతంత్య్ర సమరయోధులు, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 31 వ వర్ధంతి సందర్భంగా.. బుధవారం ఖమ్మం పార్టీ కార్యాలయం గిరి ప్రసాద్ భవన్లో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ.. చంద్ర రాజేశ్వరరావు ఆదర్శ కమ్యూనిస్టు అని కొనియాడారు.
KMM: కూసుమంచి మండల పరిధిలోని, గైగోళ్ళపల్లి గ్రామ శివారు ఉడతలగూడెం గ్రామంలో బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయానికి గ్రామస్తులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ నిర్మాణ పరిసర ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు నడుమ అర్చకులు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
కృష్ణా: ఇబ్రహీంపట్నంలో గతేడాది కృష్ణా నది వరదల్లో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఏపీసీపీడీసీఎల్ లైన్మెన్ కోటేశ్వరరావు కుటుంబానికి బ్యాంక్ అధికారులు రూ.28లక్షల బీమా చెక్కును అందజేశారు. డివిజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతుడి భార్య మాధవీలతకు బ్యాంక్ మేనేజర్ మునీర్, ఏపీసీపీడీసీఎల్ డీఈ వసంతరావు చెక్కు అందించారు.
KMM: నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. బుధవారం తల్లాడ మండలానికి చెందిన మహిళలకు ఎంపీ CMRF చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స అనంతరం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని ఎంపీ చెప్పారు. తదనంతరం ఎంపీ పలువురు నుంచి పలు సమస్యలపై వినతి పత్రలను స్వీకరించారు.
NDL: డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం తెల్లవారుజామున కలకలం రేపింది. ప్రయాణికులు స్థానికులు మృతదేహాన్ని గమనించి రైల్వే పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆయన వయసు 50 ఏళ్లు ఉండొచ్చు అని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: శ్రీకాకుళం పట్టణంలో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి, సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ ప్రజాదర్బార్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.
సత్యసాయి: మాజీ సీఎం వైఎస్ జగన్ పోసాని కృష్ణమురళి అరెస్టును కూడా వక్రీకరించి మాట్లాడారని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు విమర్శించారు. పోసాని అరెస్టుకు సంబంధించిన వాస్తవాలను పులివెందుల పూలంగళ్ల వద్ద స్క్రీన్లు పెట్టి చూపిస్తామని తెలిపారు. నిజానిజాలను పులివెందుల ప్రజలే నిగ్గు తేలుస్తారని అన్నారు.
PDPL: ఓదెల మండలం పొత్కపల్లి జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం సరిపడ వండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పాఠశాలలో సుమారు 50 మంది ఉండగా కేవలం 20 మందికి వంట చేశారని మిగతా 30 మందికి అన్నం లేక ప్లేట్లు పట్టుకొని నిలబడ్డామని వాపోయారు. ఈ విషయమై హెచ్ఎం వంట మనుషులను అడగగా అందరికీ పెట్టామని బదులిచ్చినట్లు తెలుస్తోంది.