ప్రకాశం: అర్ధవీడు మండలం కాకర్ల డ్యాం సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కంభం సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో ఎస్సై శివ నాంచారయ్య, సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.56,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని స్టేషన్ కు తరలించారు.