KMM: ముదిగొండ మండలంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి రమణయ్య శుక్రవారం పేర్కొన్నారు. ముదిగొండ, మేడపల్లి, ముత్తారం, వల్లభి, బాణాపురం, ఈ ఐదు కేంద్రాల్లో 516 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థుల కోసం తాగునీరు, వెలుతురు వంటి వసతులు కల్పించామన్నారు.