VSP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 15వ తేదీ రాత్రి విశాఖకు రానున్నారు. ఆయన ఎయిర్ పోర్టుకు చేరుకుని కిర్లంపూడి లేఅవుట్లోని తన నివాసంలో బస చేస్తారు. మార్చి 17న సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించే ఉగాది పురస్కార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 19వ తేదీ ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరుతారు.