AKP: అచ్యుతాపురం ఏపీఐఐసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. చేపట్టిన అభివృద్ధి పనులలో వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అచ్యుతాపురం జంక్షన్లో రహదారి విస్తరణ పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.