NDL: మహానంది మండలంలో అన్నదాత సుఖీభవ మూడో విడత కింద 4,200 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని ఏవో నాగేశ్వరరెడ్డి ఇవాళ తెలిపారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల రైతులకు రూ. 2.47 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేలు,కేంద్రం నుంచి రూ.2 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ సాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు.