EG: కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వరరావు శుక్రవారం పాల్గొన్నారు. ప్రజలు పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, రెవెన్యూ సంబంధిత సమస్యలపై వచ్చిన మొత్తం 18 అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.