ఏలూరు: ఎమ్మెల్యే బడేటి చంటి కవయిత్రి ఆతుకూరి మొల్ల జీవితం నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొల్లమాంబ జయంతి నిర్వహించారు. తెలుగులో ఉన్న రామాయణాల్లో మొల్ల రామాయణం చాలా సరళంగా ఉండి, సామాన్యులకు సులభంగా అర్థమయ్యే విధంగా రచించబడిందని ఆయన పేర్కొన్నారు.