WGL: పర్వతగిరి మండలానికి చెందిన ఆశా వర్కర్లు తమపై నిరాధార ఆరోపణలతో వార్త ప్రచురించినట్లు ఆరోపిస్తూ సంబంధిత విలేకరులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం మండల రెవెన్యూ అధికారి, పోలీసు శాఖ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఆశ వర్కర్లు రుక్మిణి , శారద, విజయ తదితరులు పాల్గొన్నారు.