సత్యసాయి: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ దగ్గర ఉన్న గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ ఆర్థిక సహకారంతో మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ ఈ కిట్లను అందజేశారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.