అన్నమయ్య: మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన రావు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీరాముని చరిత్రను సరళమైన తెలుగులో రచించిన గొప్ప కవయిత్రి మొల్లమాంబ అని ఆయన పేర్కొన్నారు.