కడప: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు శుక్రవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున, పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.