NLR: సంగం మండల కేంద్రంలో ఇవాల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని గాంధీ జన సంఘం వద్ద కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ పూడికతీత పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారు. అనంతరం సంగం ఇరిగేషన్ కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని సాగునీటి సంఘాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.