SKLM: మందస మండలం పెద్దకేసుపురం గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు గురై తల్లి కూతురు మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఐదు నెలల క్రితం తండ్రి మృతి చెందడంతో తల్లి మడియా కృష్ణకుమారి(38), చెల్లి యోగేశ్వరి(15)తో కలిసి నిఖిత (18) జీవనం సాగిస్తోంది. పిడుగు రూపంలో అమ్మ, చెల్లి మృతి చెందడంతో ఒంటరిగా మిగిలిన నిఖిత సోమవారం ఇరువురికి తలకొరివి పెట్టింది.