AKP: రాంబిల్లి మండలం పంచదార్లలో దళిత రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం నాటికి 63వ రోజుకు చేరుకుంది. గత ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నందుకు నిరసనగా పోరాటం కొనసాగిస్తున్నారు. విదసం రాష్ట్ర కన్వీనర్ బి. వెంకట్రావు మాట్లాడుతూ.. అధికారులు తప్పుడు నివేదిక రూపొందించి దళితుల భూములను కాజేయడానికి కుట్ర పన్నుతున్నారన్నారు.