PLD: శావల్యాపురం మండలం కనుమర్లపూడిలో ‘నీటి భద్రత’ కార్యక్రమం జరిగింది. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని ప్రోక్లైన్తో చెరువు పనులను ప్రారంభించారు. కాలువల్లో పూడికతీతతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రతి ఊరిలో ‘గ్రామ నీటి బడ్జెట్’ రూపొందించాలన్నారు. భవిష్యత్ తరాల కోసం జల వనరులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.