ELR: పోలవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మొక్కజొన్న రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు పెరిగాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్దతు ధరతో రైతులను ఆదుకుందని కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్వింటాకు రూ.2400ల మద్దతు ధర ఇవ్వాలన్నారు.