NTR: వీరులపాడు మండలం అల్లూరులో సోమవారం నాడు రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.