CTR: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి సూచించారు. అధిక లాభాల పేరుతో సోషల్ మీడియా ద్వారా మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. నకిలీ యాప్లు, వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరితోనూ పంచుకోరాదని సూచించారు.