ATP: యాడికి సమీపంలోని పెండేకల్ రిజర్వాయర్ వద్ద CM చంద్రబాబు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం, ఉపాధి హామీ పనులపై కూలీలు, రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ఇస్తోందని, ప్రీమాన్ సూన్ డ్రై సోయింగ్ విధానంతో సాగు వ్యయం తగ్గుతోందని రైతులు హరికృష్ణ, దేవి వివరించారు.