CTR: చిత్తూరు నగరంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.38,51,938 విలువైన చెక్కులను అందజేశారు. నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఈ చెక్కులను పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.