BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో సోమవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం మర్రిగూడెం, అబ్బుగూడెం ప్రాథమిక పాఠశాలల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.