WNP: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ముగ్గురిని కోర్టు జైలు శిక్ష జరిమానా విధించినట్లు వీపనగండ్ల ఎస్సై నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి అదనపు న్యాయమూర్తి శ్రీలత నిందితులకు జైలు శిక్ష, జరిమాణాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.