KNR: ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. గన్నేరువరం మండలంలోని మానసా దేవి ఆలయానికి వచ్చిన కొందరు భక్తులు.. దర్శనం అనంతరం ఆటోలో గుండ్లపల్లికి వెళ్లారు. హడావుడిలో తమ బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. ఆ బ్యాగులో 4 తులాల బంగారు గొలుసులు, రూ, 20,000 నగదు ఉన్నాయి.