AKP: నీటి భద్రతకు సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలని పాయకరావుపేట మండల టీడీపీ అధ్యక్షుడు చించెలపు ప్రదీప్ విజ్ఞప్తి చేశారు. సోమవారం శ్రీరాంపురంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలన్నారు. అలాగే, గేట్ల ఆధునీకరణ, పంట కాలువల మరమ్మత్తులు చేపట్టాలన్నారు.