ELR: చింతలపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు పలు అంశాలలో ఇవాళ అవగాహనను సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. రానున్న బోర్డు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలంటే సబ్జెక్టులపై పట్టు సాధించాలని, ఏవైనా సందేహాలు ఉంటే ఏమాత్రం సంకోచించకుండా ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు.