KDP: ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామానికి చెందిన రామాంజనేయులు, ప్రమీల నెల రోజుల క్రితం లింగాపురంలో ఇల్లు బాడుగకు తీసుకున్నారు. శనివారం ఇంట్లోనే వారి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.