MBNR: నవాబుపేట మండలం లోకిరేవులో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు త్వరలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 75 గజాల స్థలం ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్తో చర్చించి బాధితులకు త్వరగా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.