AP: ఏప్రిల్ 2న శాఖల పనితీరుపై నివేదికలు ఇస్తానని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే, 90 రోజులపాటు జలాధార కార్యక్రమం చేపట్టాలని సూచించారు. కాలువలు, డ్రెయిన్లు శుభ్రం చేయించి భూగర్భ జలాలు పెంచాలని వెల్లడించారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని, చివరి ఎకరానికి కూడా నీరిచ్చేలా జలాధార జరగాలని చంద్రబాబు ఆదేశించారు.