• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ఆదర్శ కమ్యూనిస్టు

KMM: స్వాతంత్య్ర సమరయోధులు, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 31 వ వర్ధంతి సందర్భంగా.. బుధవారం ఖమ్మం పార్టీ కార్యాలయం గిరి ప్రసాద్ భవన్‌లో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ.. చంద్ర రాజేశ్వరరావు ఆదర్శ కమ్యూనిస్టు అని కొనియాడారు.

April 9, 2025 / 10:49 AM IST

సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

KMM: కూసుమంచి మండల పరిధిలోని, గైగోళ్ళపల్లి గ్రామ శివారు ఉడతలగూడెం గ్రామంలో బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయానికి గ్రామస్తులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ నిర్మాణ పరిసర ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు నడుమ అర్చకులు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

April 9, 2025 / 10:23 AM IST

అధికారులతో పెద్దపల్లి ఎమ్మెల్యే సమావేశం

PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

April 9, 2025 / 10:17 AM IST

లైన్మెన్ కుటుంబానికి రూ.28లక్షల బీమా చెక్కు అందజేత

కృష్ణా: ఇబ్రహీంపట్నంలో గతేడాది కృష్ణా నది వరదల్లో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఏపీసీపీడీసీఎల్ లైన్మెన్ కోటేశ్వరరావు కుటుంబానికి బ్యాంక్ అధికారులు రూ.28లక్షల బీమా చెక్కును అందజేశారు. డివిజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతుడి భార్య మాధవీలతకు బ్యాంక్ మేనేజర్ మునీర్, ఏపీసీపీడీసీఎల్ డీఈ వసంతరావు చెక్కు అందించారు.

April 9, 2025 / 10:17 AM IST

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ

KMM: నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. బుధవారం తల్లాడ మండలానికి చెందిన మహిళలకు ఎంపీ CMRF చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స అనంతరం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని ఎంపీ చెప్పారు. తదనంతరం ఎంపీ పలువురు నుంచి పలు సమస్యలపై వినతి పత్రలను స్వీకరించారు.

April 9, 2025 / 10:11 AM IST

రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం

NDL: డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం తెల్లవారుజామున కలకలం రేపింది. ప్రయాణికులు స్థానికులు మృతదేహాన్ని గమనించి రైల్వే పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆయన వయసు 50 ఏళ్లు ఉండొచ్చు అని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 9, 2025 / 10:08 AM IST

జిల్లాలో ప్రజా దర్బార్ కార్యక్రమం

SKLM: శ్రీకాకుళం పట్టణంలో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి, సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ ప్రజాదర్బార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.

April 9, 2025 / 10:01 AM IST

పోసాని మాటలను స్క్రీన్లు పెట్టి చూపిస్తాం: మడకశిర ఎమ్మెల్యే

సత్యసాయి: మాజీ సీఎం వైఎస్ జగన్ పోసాని కృష్ణమురళి అరెస్టును కూడా వక్రీకరించి మాట్లాడారని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు విమర్శించారు. పోసాని అరెస్టుకు సంబంధించిన వాస్తవాలను పులివెందుల పూలంగళ్ల వద్ద స్క్రీన్లు పెట్టి చూపిస్తామని తెలిపారు. నిజానిజాలను పులివెందుల ప్రజలే నిగ్గు తేలుస్తారని అన్నారు.

April 9, 2025 / 09:42 AM IST

‘భోజనం పెట్టడం లేదని విద్యార్థుల ఆవేదన’

PDPL: ఓదెల మండలం పొత్కపల్లి జడ్పీహెచ్ఎస్‌లో మధ్యాహ్న భోజనం సరిపడ వండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పాఠశాలలో సుమారు 50 మంది ఉండగా కేవలం 20 మందికి వంట చేశారని మిగతా 30 మందికి అన్నం లేక ప్లేట్లు పట్టుకొని నిలబడ్డామని వాపోయారు. ఈ విషయమై హెచ్ఎం వంట మనుషులను అడగగా అందరికీ పెట్టామని బదులిచ్చినట్లు తెలుస్తోంది.

April 9, 2025 / 08:15 AM IST

చెట్టుపై నుంచి పడి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి

SKLM: నరసన్నపేట మండలం లుకలాంలో చింత చెట్టుపై నుంచి జారి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందాడు. బొత్స శ్రీరాములు (52) మంగళవారం చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా కింద పడ్డాడు. స్థానికులు గమనించి నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

April 9, 2025 / 08:13 AM IST

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

AKP: నాతవరం మండలం తాండవ జంక్షన్‌లో అక్రమంగా ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి ఆరు కేజీల గంజాయి స్వాధీన పరుచుకొని రిమాండ్‌కి తరలించామని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ చెప్పారు. నాతవరం ఎస్సై భీమరాజుకు ముందస్తు సమాచారంతో బస్సుని ఆపడంతో నిందితులు పారిపోతుండగా సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

April 9, 2025 / 07:45 AM IST

ఇస్రో యువిక -2025కు జగిత్యాల విద్యార్థిని

JGL: ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాలలో మేలో 12 రోజులు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 12 మందిలో అశ్విని ఒకరు కావడం విశేషం.

April 9, 2025 / 07:42 AM IST

‘వికలాంగుడికి న్యాయం చేయాలి’

AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం గ్రామానికి చెందిన వికలాంగుడు మజ్జి రమేశ్‌కు న్యాయం చేయాలని ఎంపీపీ గజ్జలపు మణికుమారి కోరారు. మంగళవారం తహశీల్దార్ పి.శ్రీనివాసరావును కలిశారు. ఎంపీపీ మాట్లాడుతూ.. రమేశ్ తండ్రి మజ్జి నూకన్న ఇంటి స్థలం యొక్క ప్లాట్ నెంబరు 35 ప్రకారం కేటాయించిన స్థలంను వరుస క్రమంలో సరి చేసి ఇప్పించి వికలాంగుడికి న్యాయం చేయాలన్నారు.

April 9, 2025 / 07:08 AM IST

వృద్ధురాలి హత్య కేసులో నిందితుల అరెస్ట్: డీఎస్పీ

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. మంగళవారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడని ఈ నెల 3వ తేదీ ప్రేమికుడిని కొట్టి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులపై దాడి చేసి వృద్ధురాలిని హత్య చేశారని తెలిపారు.

April 9, 2025 / 06:56 AM IST

భార్య మృతిని తట్టుకోలేక భర్త గుండెపోటుతో మృతి

GNTR: పొన్నూరు నిడుబ్రోలు వద్ద విషాదం జరిగింది. భార్య మృతిని తట్టుకోలేక గుండెపోటుతో భర్త మరణించిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. మాజీ ఆర్మీ ఉద్యోగి అన్నవరపు ఆశీర్వాదం(85), భార్య సామ్రాజ్యం(76) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారు. సోమవారం రాత్రి సామ్రాజ్యం మృతిచెందగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆశీర్వాదం మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు.

April 9, 2025 / 06:38 AM IST