• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ల ప్రారంభం

JGL: మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్లను ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. మెట్‌పల్లిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలు పెరగడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

March 13, 2026 / 01:22 PM IST

‘భూగర్భ జలాలు పెంపొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం’

అన్నమయ్య: చిన్నమండెం మండలం కేశాపురంలో పాలేటమ్మ చెరువు పూడికతీత, కటువ మరమ్మతు పనులను టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. చెరువులు, కాలువల్లో పూడిక తీసి భూగర్భ జలాలను పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వెంకటరత్నం, ఇరిగేషన్ ఈఈ చెంగలరాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 13, 2026 / 01:22 PM IST

SSC పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం: DEO లలిత

ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా SSC పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు DEO లలిత శుక్రవారం తెలిపారు. పరీక్షలకు మొత్తం 6,949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్, OMR షీట్ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రశ్నా పత్రాన్ని పూర్తిగా చదువుకున్న తర్వాతే సమాధానాలు రాయాలని, ఎటువంటి ఒత్తిడికి లోనుకావద్దని పేర్కొన్నారు.

March 13, 2026 / 01:21 PM IST

‘మహిళలకు ఆదర్శంగా మొల్లమాంబ’

ప్రకాశం: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ భావితరాల మహిళలకు ఆదర్శప్రాయమని మార్కాపురం జేసీ శ్రీనివాసులు అన్నారు. ఇవాళ ఆమె జయంతి సందర్భంగా పట్టణంలోని తర్లపాడు రోడ్‌లో ఉన్న విగ్రహానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి నివాళులర్పించారు. మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం లేని 16వ శతాబ్దంలోనే తన ప్రతిభతో రామాయణాన్ని తెలుగులో అనువాదించి స్ఫూర్తిగా నిలిచారన్నారు.

March 13, 2026 / 01:21 PM IST

వేసవి జాగ్రత్తలపై అవగాహన సదస్సు

PPM: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా దుకాణాలు, సంస్థలు, వివిధ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం జిల్లా ఇన్-ఛార్జ్ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పి. సువర్ణ సూచించారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు.

March 13, 2026 / 01:20 PM IST

ఘనంగా కవియత్రి మొల్ల జయంతి వేడుకలు

AKP: మాకవరపాలెం మండలం పెద్దిపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని చేతివృత్తి కార్మికులను కలిసి వారి సమస్యలు, పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేవి. సత్యనారాయణ పాల్గొన్నారు.

March 13, 2026 / 01:20 PM IST

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలతో కూడిన వినతిపత్రాలను స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు.

March 13, 2026 / 01:19 PM IST

జిల్లాలోని ఇంటర్ పరీక్షలు.. 97.46% హాజరు

KMR: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్ ద్వితీయ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 7,649 మంది విద్యార్థులకు గాను 7,455 మంది హాజరయ్యారని, 194 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లాలో 97.46 శాతం హాజరు నమోదైందని ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు

March 13, 2026 / 01:14 PM IST

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అనుష్క..?

అనుష్క పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న ఆమె, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోబోతున్నారట. ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

March 13, 2026 / 01:14 PM IST

సుకురులో నూతన గ్రామ సచివాలయం ప్రారంభం

ASR: హుకుంపేటలో నూతన గ్రామ సచివాలయాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ హయాంలో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో ఇంటివద్దకే సేవలందాయన్నారు. ప్రస్తుతం రేషన్, పెన్షన్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

March 13, 2026 / 01:12 PM IST

గురుకుల విద్యాలయం ఆకస్మిక తనిఖీ

NGKL: కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్‌లోని గురుకుల విద్యాలయంను రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, వంట సరుకులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఆహార నాణ్యత గురించి ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.

March 13, 2026 / 01:12 PM IST

గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు

KNR: గన్నేరువరం మండలంలోని కొండాపూర్‌లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం “డ్రై డే ఫ్రైడే” కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి చెత్తను తొలగించారు. వర్షాల వల్ల నిల్వ నీటిలో దోమలు పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సర్పంచ్ అజయ్ వర్మ తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని గ్రామస్తులను కోరారు.

March 13, 2026 / 01:11 PM IST

తాడిమర్రి సింగిల్ విండో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

సత్యసాయి: తాడిమర్రి ప్రాథమిక వ్యవసాయ సహాయక పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా కునుకుంట్ల వడ్డీ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు రైతులకు చేరవేయడంలో వారధిగా నిలవాలని మంత్రి సూచించారు.

March 13, 2026 / 01:10 PM IST

ధర్మారంలో ఇంటర్ పరీక్షకు 9 మంది గైర్హాజర్

PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 9 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వివరించారు. రెండు కేంద్రాలలో 452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా, 443 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు వారు వివరించారు.

March 13, 2026 / 01:10 PM IST

ఆలయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే

NLG: నకిరేకల్‌లోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ, భక్తులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సాయిబాబా ఆలయ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన తనుకునూరి శ్రీనివాస్, కమిటీసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వారిని అభినందించారు. ఆలయంలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

March 13, 2026 / 01:10 PM IST