ELR: ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలతో కూడిన వినతిపత్రాలను స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు.