అన్నమయ్య: చిన్నమండెం మండలం కేశాపురంలో పాలేటమ్మ చెరువు పూడికతీత, కటువ మరమ్మతు పనులను టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. చెరువులు, కాలువల్లో పూడిక తీసి భూగర్భ జలాలను పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వెంకటరత్నం, ఇరిగేషన్ ఈఈ చెంగలరాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.