NLG: చెస్ ద్వారా చదువుపై ఏకాగ్రత, చురుకుదనం, దృష్టి పెరుగుతాయని జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం కొప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెస్ బోర్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెస్ ఒక ఆట మాత్రమే కాదని, దీని ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అన్నారు.