VZM: గజపతినగరం వైసీపీ పరిశీలికురాలిగా మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ శోభా స్వాతీ రాణి ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్బంగా వైసీపీ సీనియర్ నాయకురాలు శోభా హైమావతితో కలిసి శుక్రవారం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనువాసరావును ధర్మపురిలోని తమ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చిన్నశ్రీను స్వాతి రాణికి సూచించారు.