ATP: గుత్తి మండలంలో ఈ నెల 16 నుంచి జరిగే టెన్త్ క్లాస్ పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శుక్రవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండల ప్రధాన కార్యదర్శి గౌతమ్ యాదవ్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు.