ADB: అందరికీ ఆదర్శ మహిళ మొల్ల మాంబా అని ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామ సర్పంచ్ రేణుక అన్నారు. మొల్ల మాంబ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం లక్కారం కుమ్మరి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేశారు. మొల్ల మాంబ తెలుగులో మొదటి రచయిత్రి అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.