MBNR: హన్వాడ బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా తిరుపతయ్య నియమితులయ్యారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు కొండ లింగన్న వివరాలు వెల్లడించారు. బీజేపీ బలోపేతానికి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తిరుపతయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.