GNTR: తెనాలిలో శనివారం రాత్రి జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఎవరైనా సహజ మరణం పొందితే వారి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇందులో పవన్ కళ్యాణ్ తరపున రూ. 50 వేలు, స్థానిక నాయకత్వం ద్వారా మరో రూ. 50వేలు అందజేస్తామని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.